ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చంద్రబాబు సంస్థకూ రాయితీః వైఎస్ వెల్లడి  Search similar articles
తమ హయాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ కోల్డ్ స్టోరేజ్ సంస్థకూ రాయితీ అందించామని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. ఆ సంస్థకు మాత్రమే రూ. 78 లక్షల మేర సబ్సిడీ అందించామన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన పునరంకిత సభలో ఆయన ప్రసంగిస్తూ పేదలతో పాటు బాబు వంటి పెద్ద పారిశ్రామిక వేత్తలకూ సాయం చేస్తున్నామన్నారు.

పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి తన కుమారుడిపై ఆరోపణలు చేయగా, దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించామని గుర్తు చేశారు.

అన్నిటా పారదర్శకంగా వ్యవహరిస్తున్నందున తమపై అవినీతి ఆరోపణలు కేవలం ప్రచార వ్యాఖ్యలు మాత్రమే కాగలవన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ఎపుడో చెప్పిందన్నారు.
మరిన్ని
మూగ జీవులపై వడదెబ్బ  
ఆరు నూరైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: డీఎస్  
రాజకీయ మార్పు కోసమే పోటీ: జయప్రకాష్
గీత కార్మికులకు ఐదు ఎకరాల భూమి: బాబు
మల్లయ్య సమాధానంతో ఖంగుతిన్న బాబు  
తూగో మెట్ట ప్రాంతాల్లో చిరుత సంచారం