కోనసీమవాసుల కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి. స్వామి వారి కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున ఎదుకోలు వాహనంపై ఏకశిలా రూపులైన శ్రీమూర్తులు ఊరేగారు. స్వామి ఉత్సవాల సందర్భంగా అన్నవరంకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పట్టు వస్త్రాలు సమర్పించింది.
ఇదిలావుండగా జైపూర్ వరుస బాంబు పేలుళ్ళ నేపథ్యంలో అన్నవరం కళ్యాణోత్సవాలకు గట్టి భద్రతను కల్పించారు. పోలీసు జాగిలాలు, బాంబు స్క్వాడ్లు, ప్రత్యేక పోలీసు బృందాలతో పాటు పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు.
|