ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సొంత ఊరికి చేరుకున్న జ్యోతిర్మయి మృతదేహం  Search similar articles
WD
బ్రిటన్‌లోని బర్మింగ్‌హ్యామ్‌లో హత్యకు గురైన విజయవాడ విద్యార్థిని జ్యోతిర్మయి మృతదేహం ఎట్టకేలకు శనివారం ఉదయం విజయవాడకు చేరుకుంది. శవపేటికను చూడగానే విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. వీరి రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసముద్రాన్ని తలపించింది. మృతదేహం వెంట యూనివర్శిటీ ప్రతినిధులు కూడా వచ్చారు.

యూనివర్శిటీ సమీపంలో నివశిస్తున్న జ్యోతిర్మయి ఈనెల ఆరో తేదీన అనుమానాస్పదస్థితిలో హత్యకు గురైన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక విద్యార్థిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా బ్రిటన్ ప్రభుత్వం లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత మృతదేహం శనివారం విజయవాడకు తీసుకొచ్చారు.

మృతదేహం వెంట వచ్చిన వోల్వర్ యూనివర్శిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయానికి జ్యోతిర్మయి చెల్లించిన 6.5 లక్షల రూపాయల ఫీజును తిరిగి చెల్లించనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా.. జ్యోతిర్మయి సోదరికి తమ యూనివర్శిటీలో ప్రవేశం కల్పిస్తామని వారు వివరించారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
రహదారుల రక్తసిక్తం: 14 మంది మృత్యువాత
పెట్రో వడ్డనను తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం
రాష్ట్రంలో రౌడీ రాజ్యం: చంద్రబాబు
తెలంగాణా వల్ల పార్టీకి తీవ్ర నష్టం: ఉప్పునూతల
రాజకీయ వ్యవస్థలో పెరిగిన అవినీతి: జయప్రకాష్
ప్రజా నిరసనల ముందు అన్నీ బలాదూర్..!