ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్రంలోని యూపీఏ పాలనకు దేశ వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా కమలనాథులకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందన్నారు. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో యూఎన్పీఏ కూటమి విజయం సాధిస్తుందని బాబు ప్రకటించారు.
'మీ కోసం' యాత్రలో భాగంగా ఆయన ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగిస్తూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు భాజపాకు అనుకూలంగా ఉంటాయని ముందే ఊహించామన్నారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు దేశ వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే నిజాన్ని తేటతెల్లం చేశాయని ఆయన అన్నారు.
|