నెల్లూరు జిల్లా రాపూర్ వద్ద సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో దాదాపు 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
అధికారుల సమాచారం మేరకు రాపూర్ నుంచి చిట్వేలుకు వెళ్లే మార్గంలో ఉన్న ఘాట్రోడ్లో ఈ ప్రమాదం సంభవించింది. ఘాట్రోడ్లో 50మందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న లోయలో పడింది.
దీంతో దాదాపు 30మంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. వీరిని బయటకు తేవడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని వైద్యసేవల నిమ్మితం ఆస్పత్రికి తరలించారు.
|