ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మద్యం షాపుల టెండర్ల కోసం పోటాపోటీ  Search similar articles
FileFILE
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మద్యం షాపుల టెండర్లను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన సాగుతోంది. అయితే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ విధానంలో భాగంగా 348 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులోభాగంగా వీటిని దక్కించుకునేందుకు నెల్లూరు జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంది.

కేవలం మద్యం వ్యాపారులే కాకుండా రియల్ ఎస్టేట్ యజమానులు సైతం వీటికి పోటీ పడుతుండటంతో గట్టి పోటీ నెలకొంది. ఈ మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి 160 కోట్ల రూపాయల మేరకు ఆదాయం లభించవచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో మద్యం షాపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళలే టెండర్లకు పోటీ పడటం పెద్ద చర్చనీయాంశమైంది.
వీడియోను వీక్షించండి
మరిన్ని
కోడెలపై కేసు ఎత్తివేతకు పోలీసుల సమ్మతం  
కేసీఆర్‌కు రాజకీయ అవగాహన లేమి: బాబు
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు తథ్యం: జానారెడ్డి
సరికొత్త రూపంలో వెబ్‌దునియా తెలుగు... అతి త్వరలో...
కొనసాగుతున్న కోడెల ధర్నా  
ఆంగ్ల మాధ్యమంలో చదవండి: వసతులు ఏవండీ...?