తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సమాచార శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. కలెక్టర్లు అవినీతికి సాక్ష్యంగా నిలుస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ విషయమై గురువారం జూబ్లీహాల్ ఆవరణలో మీడియా ప్రతినిధుతులతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే బాబు ఈవిధంగా వ్యాఖ్యానిస్తున్నారని ఆనం ఆరోపించారు. రాష్ట్ర ప్రగతిని చూసి ఏమీ మాట్లాడుతున్నామో తెలియని అయోమయస్థితిలో ఉన్నారని ఆనం ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి అవినీతికి కలెక్టర్లే ప్రత్యక్ష సాక్షులని తూర్పు గోదావరి జిల్లా "మీకోసం" యాత్రలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి పారదర్శకత పాటించామని, అవినీతి ఎక్కడ బయటపడుతుందనే భయంతో ప్రస్తుత వైఎస్సార్ ప్రభుత్వం వీటిని నిర్వహించడం లేదని బాబు ధ్వజమెత్తారు.
|