ఒరిస్సాలోని చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు చేసిన మెరుపుదాడిలో తొమ్మిది మంది గ్రేహౌండ్స్ బలగాలు తీవ్రంగా గాయపడగా మరో 35 మంది నీటిలో గల్లంతయిన విషయం తెలిసిందే. కాగా వారికోసం బలిమెల పరిసర ప్రాంతాల్లో గాలింపు బృందాలు గాలింపు చర్యలు చేపట్టింది.
దాని ఫలితంగా గురువారం మరోమూడు మృతదేహాలను గాలింపు బృందం కనుగొన్నారు. ఈ గాలింపుల్లో దొరికిన శవాలను ఎస్సై శంకర్ రావు, చిత్రకొండ కానిస్టేబుళ్లు రంజన్ కుమార్ కోరా, సల్లావుద్దీన్లుగా గుర్తించామని గాలింపు బృందం తెలిపింది.
గత కొద్దిరోజులకు ముందుగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం సీలేరునదిలో మావోయిస్టులు చేసిన భారీ దాడిలో గ్రేహౌండ్స్ దళాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా ఈ దాడులలో సుమారు 35 మంది పోలీసులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు చేపట్టిన గాలింపుల్లో గల్లంతయిన వారిలో పదిమంది మృతదేహాలను సహాయక సిబ్బంది కనుగొన్నారు.
|