రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీకోసం యాత్ర చేపట్టి ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రి ఆనం రాంనాయణరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థను అవమానిస్తూ బాబు చేసిన విమర్శలను ఆయన తప్పుపట్టారు. అవినీతి పనులకు అడ్డుకట్టవేసిన ప్రజలను తప్పుపట్టే పరిస్థితిలో బాబు ఉన్నారని ఆనం చమత్కరించారు.
బాబు కలెక్టర్లను అవినీతి పరులుగా చిత్రికరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా, బాబు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్లు కూడా తప్పు పట్టారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో తామతో పనులు చేయించుకున్న సంగతిని మరిచిపోరాదని హితవు పలికారు.
హైదరాబాద్లో వైఎస్సార్తో భేటీ పూర్తయిన అనంతరం కొందరు కలెక్టర్లు విలేకరులతో పైవిధంగా మాట్లాడారు. అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే బ్యూరోక్రసిలో కూడా కొంత అవినీతి నెలకొని ఉండవచ్చునని, అంతమాత్రాన కలెక్టర్లవ్యవస్థను అవినీతిపరులనడం సబబు కాదని వారు హెచ్చరించారు.
|