రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో యానిమేషన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రిదామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీకి ధీటుగా యానిమేషన్ విప్లవం వచ్చిందని ఆయన అన్నారు. యువతకు యానిమేషన్ రంగంలో విశేష ఉపాధి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
యానిమేషన్లో శిక్షణ పొందిన యువతకు మల్టీ నేషనల్ కంపెనీలలో వేలాది రూపాయలతో ఉద్యోగాలను సాధించవచ్చునని తెలిపిన ఆయన, నగరంలో ఏర్పాటయ్యే యానిమేషన్ సెంటర్ ద్వారా ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో నగరంలోనే యానిమేషన్ రంగంలో ఉద్యోగవకాశాలు లభిస్తాయన్నారు.
|