ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > కాంగ్రెస్‌కు స్వస్తి... "చిరు"తో దోస్తి! : జోగయ్య
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాంగ్రెస్‌కు స్వస్తి... "చిరు"తో దోస్తి! : జోగయ్య
కాంగ్రెస్‌పార్టీ నర్సాపురం ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కాంగ్రెస్ పార్టీ, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీకి ఫ్యాక్స్ మూలంగా తన రాజీనామా లేఖను పంపించారు.

గత కొంత కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జోగయ్యలకు మధ్య విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... జూబ్లీహిల్స్‌లోని తన పార్టీ కార్యాలయంలో చిరంజీవి మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పరచి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దీనితో జోగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి పార్టీలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. తన రాజీనామాకు కారణాలు ఏమిటన్న విషయాలపై సోనియాగాంధీకి పంపినలేఖలో సవివరంగా తెలిపినట్లు జోగయ్య తెలిపారు. చిరంజీవి జరిపిన విలేకరుల సమావేశంలో చాలా చక్కగా సమాధానాలిచ్చారని ప్రశంసల వర్షం కురిపించారు.
మరిన్ని
అదేమంత గొప్ప పార్టీ కాబోదు : వైఎస్సార్
తెలుగు విద్యార్థుల సమస్యల పరిష్కరిస్తాం: రాజనర్సింహా
బిపిటి బియ్యం రూ.18కే అందజేస్తాం: రోశయ్య
రేపు మీడియా ప్రతినిధులతో చిరు భేటీ
చిరు పార్టీ సునామీయే : జోగయ్య
మళ్లీ అధికారం మాదే..: వైఎస్సార్