సినీనటుడు రాజకీయ రంగ ప్రవేశించడానికి అభిమానులుంటే మాత్రం సరిపోదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ... పదవిలోకి రావడానికి అభిమానులుంటే సరిపోదని, ఓ స్పష్టమైన ప్రణాళిక కూడా ఉండాలని చెప్పారు.
గత ఐదు నెలల నుంచి పదవి కోసం చిరంజీవి అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాగా రాజకీయ ప్రవేశంపై చిరంజీవికి స్పష్టమైన అవగాహన లేదని ఎర్రన్నాయుడు వ్యాఖ్యానించారు. ఖచ్చితమైన అజెండాతో చిరంజీవి ప్రజల్లోకి రావాలని ఎర్రన్నాయుడు కోరారు.
|