నల్లకుంట జంట హత్యల కేసులో ఓ నిందితుడికి నాంపల్లి కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలకు చెందిన విద్యార్థులు సనయ్ షరీఫ్, సంజయ్ గిరిలను అదే కాలేజీలో జూనియర్ విద్యార్థి అయిన నవీన్ రెడ్డి 2006లో హత్య చేసి పరారైయ్యాడు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును గురువారం విచారించిన న్యాయస్థానం నవీన్ రెడ్డికి పదేళ్ల కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానాను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ర్యాగింగ్ పేరుతో సనయ్, సంజయ్లు వేధింపులకు గురిచేస్తుండటంతో నవీన్ రెడ్డి వారిని కత్తితో పొడవటంతో వారిద్దరూ మరణించారు.
|