భాగ్యనగరంలోని ట్రాన్స్కో గోడౌన్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్కూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంవల్ల ఆస్తి నష్టం కలిగిన వాటిపై పూర్వాపరాలు ఇంకా తెలియరాలేదు.
ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు పదికిపైగా అగ్నిమాపక సిబ్బింది రంగంలోకి దిగారు. ట్రాన్స్కో గోడౌన్లో మంటలను అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ గోడౌన్ ఉన్న మోతీనగర్ కాలనీ వాసులు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. గోడౌన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పేలతాయన్న పుకార్లతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. అలాంటి ప్రమాదాలు జరుగవని సంబంధిత అధికారులు హామీ ఇస్తున్నా, ప్రజలు మాత్రం ఇళ్ళలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు.
|