ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > 'చిరు' పార్టీ తీర్థం పుచ్చుకోనున్న బండారు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'చిరు' పార్టీ తీర్థం పుచ్చుకోనున్న బండారు
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వలసల వెల్లువ రోజు రోజుకు అధికమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గురువారం చిరంజీవి పార్టీలో చేరగా, తాజాగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, తెదేపా బండారు సత్యానందరావు చిరు పార్టీలో చేరనున్నారు.

జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కలిసి ఆయన ప్రజారాజ్యం పార్టీ గూటిలో చేరనున్నారు. చిరంజీవి పార్టీలో చేరేముందు సత్యానందరావు టీడీపీకి రాజీనామా లేఖను పంపిచనున్నారని సన్నిహితుల సమాచారం.

ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తెదేపా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ... సత్యానందరావు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఏ మాత్రం నష్టం వాటిల్లబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని
రానున్న ఎన్నికలలో ఒంటరి పోరు: ప్రజారాజ్యం
ఓ ప్రేమ వివాహం : వివాదంలో చిరంజీవి
పదిమంది మావోయిస్టుల అరెస్టు!
ప్రధాని గద్దె దిగాలి : చంద్రబాబు
సీపీడీసీఎల్ ట్రాన్స్‌కోలో పెను అగ్నిప్రమాదం
నల్లకుంట హత్య కేసు : నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష