ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ప్రజారాజ్యం పార్టీకి సమాజ్‌వాదీ మద్దతు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రజారాజ్యం పార్టీకి సమాజ్‌వాదీ మద్దతు
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి సమాజ్‌వాది పార్టీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ప్రజారాజ్యం పార్టీతో దోస్తి కట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాది పార్టీ నాయకుడు అమర్‌సింగ్ తెలిపినట్లు విశ్వసనీయుల సమాచారం.

కాగా ప్రజారాజ్యం పార్టీతో దోస్తి చేసే విషయంపై సమాజ్‌వాది పార్టీ నేతలు జయాబచ్చన్, జయప్రదలతో కలిసి ఈ నెల ఏడో తేదీన ఆ పార్టీ అధినేత చిరంజీవితో చర్చించనున్నట్లు సమాచారం.

అనంతరం రాబోయే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు చిరంజీవి పార్టీ తరపున రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోను పర్యటించి విస్తృతంగా ప్రచారం కూడా చేస్తారని అమర్‌సింగ్ చెప్పారు. చిరంజీవి పార్టీ విధి విధానాలను, లక్ష్యాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళతారని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.
మరిన్ని
తెదేపాను ఓడించే సత్తా పీఆర్పీకి లేదు: ఎర్రన్నాయుడు
అసెంబ్లీ రేపటికి వాయిదా
కాంగ్రెస్‌పై 'చిరు' పార్టీ ప్రభావం ఉండదు : ధర్మాన
చిరంజీవిని లాగడంలో అర్థం లేదు : నళిని
ఎన్నికల తర్వాతే ప్రత్యేక రాష్ట్రం: కేసీఆర్
విద్యుత్ కోతపై సభలో చర్చ: విపక్షాల వాకౌట్