అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం సభ ప్రారంభంకాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టాలని పట్టుబట్టాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి సురేష్రెడ్డి తిరస్కరించారు. దీనితో ప్రతిపక్ష పార్టీల నేతలు సభలో నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల కష్టనష్టాలు, పీఆర్సీ అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టాలని కోరింది.
గీత కార్మికుల సంక్షేమంపై భారతీయ జనతా పార్టీ, భాగ్యనగరంలోని పరిసర ప్రాంతాల్లో భూమలను క్రమబద్ధీకరణ చేయాలని, ఎంఐఎం వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి.
|