వర్షాకాల సమావేశాన్ని స్పీకర్ సురేష్ రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శనివారం సభలో వివిధ అంశాలపై చర్చలు జరిగిన అనంతరం మధ్యాహ్నం సభ వాయిదా పడింది. అంతకుమందు దేవాదుల సాగునీటి ప్రాజెక్ట్లోని లోపాలను ఎత్తిచూపుతూ విపక్షాలు ఆరోపణల వర్షం కురిపించగా ప్రభుత్వం వాటిని త్రోసిపుచ్చింది.
తదనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారని విపక్షాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. దీనికి సంబంధిత మంత్రి స్పందిస్తూ.... ఇది రాష్ట్ర పరిధిలోని సంబంధించిన అంశంకాదని చెప్పారు.
దీనిపై సివిల్ ఏవియేషన్ మినిస్ట్రితో పాటు జీఎంఆర్ సంస్థతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అంశమని మంత్రి వివరించారు. హజ్ యాత్రికులకు యూజర్ ఛార్జీలపై మినహాయింపు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. యూజర్ ఛార్జీల వసూలుపై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. వీరి ప్రతిపాధనను స్పీకర్ తీరస్కరించారు.
|