ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత విలయతాండవం చేస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం నెల క్రితం బుక్ చేసుకున్నప్పటికీ సిలిండర్లను మాత్రం ఇప్పటి వరకు సరఫరా చేయలేక పోతున్నారు. దీంతో స్థానికులు గ్యాస్ ఏజన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్లు తెరిచి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలావుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా సాగుతున్న విషయం తెల్సిందే. పలు ప్రాంతాల్లో మహిళలు సిలిండర్ల కోసం ఆందోళన కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి.
|