ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ఎరువుల నిల్వలపై అధికారుల తనిఖీలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎరువుల నిల్వలపై అధికారుల తనిఖీలు
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులోభాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అక్రమంగా తరలిస్తున్న వంద బస్తాల ఎరువులను అధికారులు పట్టివేశారు.

విశాఖ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన మూడొందల యూరియా బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలో మల్లంపేట నుంచి చెన్నైకు తరలిస్తున్న 136 ఎరువుల బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఎరువుల గోడౌన్‌పై తాజాగా రైతులు దాడి చేసి ఎరువుల లూటీకి పాల్పడ్డారు. నల్గొండ జిల్లా మనుగోలులో రైతులు ఈ రోజు ఉదయం ఎరువుల లారీపై దాడి చేసి దాదాపు 420 బస్తాల ఎరువు బస్తాలను తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఎరువుల గోడౌన్‌పై అన్నదాతలు డాడిచేసి సుమారు 300 బస్తాల ఎరువులను లూటీ చేశారు.
మరిన్ని
మాకు ఎలాంటి నష్టం లేదు: ముఖ్యమంత్రి
చిరంజీవికి పూర్తి మద్దతు : జయప్రద
ప్రజల సాధక బాధలపైనే మా దృష్టి: సీఎం
"చిరు" అభిమానులం... కనుకనే వచ్చాం‌: అమర్‌సింగ్
ప్రజ సమస్యలే 'ప్రజారాజ్యం' ఎజెండా: చిరు
పార్టీకి పూర్వవైభవం తెస్తాం: నందమూరి హీరోలు