ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > చికెన్‌తో దీక్షకు స్వస్తి చెప్పిన నారాయణ!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చికెన్‌తో దీక్షకు స్వస్తి చెప్పిన నారాయణ!
సాధారణంగా నిమ్మరసంతోనో లేదా వేరేదేని పానీయాలను సేవించి దీక్షలకు స్వస్తిపలుకుతున్న సంఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ మరో వింత మార్గంలో దీక్షకు స్వస్తి చెప్పిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సాక్షాత్తు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆ దీక్షకు కేంద్రబిందువు కావడంతో విషయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక అసలు విషయమేమిటంటే... గాంధీ జయంతి రోజున చికెన్ ముట్టుకున్న పాపానికి, ఏడాది కాలం పాటు మాంసాహారాన్ని తిన్నంటూ గత 2007 అక్టోబర్ 3న ఆయన తానుగా విధించుకున్న దీక్షను నారాయణ నేడు (శుక్రవారం) ఉపసంహరించుకున్నారు.

ఇంకా చెప్పాలంటే... నారాయణకు మాంసాహారం అమితమైన ఇష్టం కావడంతో, ఏడాదిపాటు ముట్టనన్న దీక్షకు శుక్రవారం రోజునే స్వస్తి చెప్పినా ఏం పర్వాలేదని చికెన్‌‌ను ప్రీతిపాత్రంగా లాగించేశారు. ఏడాది క్రితం మీడియా సమక్షంలో చేపట్టిన ఈ దీక్షను, నేడు మీడియా ముందే విరమించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు నారాయణ విందును ఏర్పాటు చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎరువుల గోదాములపై రైతుల దాడి
బెల్టుషాపులపై సమగ్ర నివేదిక సమర్పించాలి : సీఎం
తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
మహాకూటమి ఏర్పాటు అసాధ్యం : నారాయణ
ఆర్థిక పరిస్థితి భ్రష్టుపటింది : బాబు
చంద్రయాన్ ప్రయోగంపై కసరత్తు