పీఆర్పీ నేత, మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ రంగారెడ్డి పర్యటనకు విశేష స్పందన లభించింది. ఇంకా.. వికారాబాద్, పరిగి, తాండూరు వంటి తదితర ప్రాంతాల్లో పవన్ పర్యటించనున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన పవన్ ఇబ్రహీం పట్నంలోని పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసి, జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పవన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఓట్ల రాజకీయాలకు పాల్పడే వారికి అభిమానులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చిరంజీవి ఎందుకు రాజకీయాల్లోకి ప్రవేశించారని ప్రశ్నించేవారు... ఎవరినడిగి రాజకీయాల్లోకి వచ్చారని ధీటుగా ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీతోనే సామాజిక న్యాయం చేకూరుతుందని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. |