ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > తెలంగాణపై టీడీపీ నిర్ణయం సరైందే: మధుయాష్కీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తెలంగాణపై టీడీపీ నిర్ణయం సరైందే: మధుయాష్కీ
ప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం సరైందేనని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ విషయంపై తెదేపా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని గౌడ్ తెలిపారు.

అయితే పార్టీలో కొన్ని తెలంగాణా వ్యతిరేక శక్తులు ఉన్నాయని, తెలంగాణ నేతలంతా కలిసి అధిష్టానానికి వాస్తవాన్ని వివరించాల్సిన అవసరం ఉందని మధుయాష్కీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, తెరాసను ఎదుర్కోవాలంటే పార్టీ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఉప ఎన్నికల్లో ఒవైసీ ప్రచారం చేసినా ముస్లింల ఓట్లు ఎటుపోయాయని మధుయాష్కీ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఒవైసీ ముస్లింలందరికీ ప్రతినిధి కాదని, వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసేదెవరని అధిష్టానమే నిర్ణయిస్తుందని యాష్కీ స్పష్టం చేశారు. ముస్లింలు తెలంగాణా కోరుకోవడం లేదన్న ఒవైసి, వైఎస్ వ్యాఖ్యలతో యాష్కీ విభేదించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వైఎస్‌వి ఊసరవెల్లి రాజకీయాలు: కేసీఆర్
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా
రాష్ట్రంలో ప్రత్యేక విశ్వవిద్యాలయాల ఏర్పాటు
పవన్ పర్యటనకు విశేష స్పందన
పన్ను ఎగ్గొట్టే అలవాటు నాకు లేదు : చిరు
కాంగ్రెస్‌ సినీ సందడి : పార్టీలో చేరిన జయసుధ