ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పులివెందులలో 'మెగా'షోకు పోటెత్తిన జనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పులివెందులలో 'మెగా'షోకు పోటెత్తిన జనం
అది ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కోట. అక్కడ జరిగే ప్రతి సంఘటన ఆయన కనుసన్నల్లో జరుగుతుంది. అక్కడ నివశించే ప్రతి పౌరునికి ఆయన మాటే వేదం. ప్రతి పనివాడు ఆయన అనుచరులు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. అదే పులివెందుల గడ్డ. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాకా. అలాంటి గడ్డపై బుధవారం 'నేల ఈనిందా.. నింగికి చిల్లుపడిందా' అనే రీతిలో జనం పోటెత్తారు.

పులివెందుల నాలుగు కూడలి నాలుగు సముద్రాలు కలిసిన మహా జన సముద్రాన్ని తలపించింది. పులివెందుల వాసులు తనకు బ్రహ్మరథం పట్టడంతో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పులకించి పోయారు. ఇది పులివెందుల గడ్డ కాదని, పూలమాలతో స్వాగతం పలికే గడ్డగా అభివర్ణించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగించారు.

మంగళవారం రాత్రి ప్రరాపా నేతలపై జరిగిన దాడులను ఖండించారు. హింసకు ప్రతిహింస సమాధానం కాదని చెపుతూనే.. తమ నేతలపై జరిగిన దాడులకు నిరసనగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలకు చిరంజీవి హ్యాట్సాఫ్ చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలకు బెదరవద్దని, ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
వీడియోను వీక్షించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రాష్ట్ర వ్యాప్తంగా ప్రరాపా శ్రేణుల 'గాంధీగిరి'
దాడులకు నిరసనగా నేడు ప్రదర్శనలు : పీఆర్‌పీ  
తెలంగాణపై కాంగ్రెస్ సానుకూల నిర్ణయం : కేసీఆర్
'సీమ' ప్రజలకు 'చిరు' క్షమాపణ చెప్పాలి : పీసీసీ
వృద్ధుల పట్ల ప్రభుత్వ వైద్యుని దురుసుతనం  
సీమ యాత్రకు 'సమరసింహా రెడ్డి' సమాయత్తం