ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ చేసిన విస్పష్ట ప్రకటన కాంగ్రెస్ పార్టీలో కలవరంరేపిందని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల రాజధానిలో జరిగిన బహిరంగ సభలో భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణా రాష్ట్రాన్ని వంద రోజుల్లో ఇచ్చేస్తామని అద్వానీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
అందువల్లే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిలు తెలంగాణాపై విస్తృత ప్రచారం చేస్తున్నారన్నారు. రాజ్యాంగంలోని అధికరణ-3 ప్రకారం పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణా బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఒక్క భాజపా వల్లే సాధ్యమవుతుందన్నారు. |