ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ఆ ప్రాజెక్టులో వైఎస్‌కు భారీగా ముడుపులు: బాబు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆ ప్రాజెక్టులో వైఎస్‌కు భారీగా ముడుపులు: బాబు
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా చేపట్టిన ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టులో ముఖ్యమంత్రి వైఎస్‌కి వెయ్యి కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపై ఆయన గురువారం మాట్లాడుతూ.. వైఎస్‌ నిర్వహిస్తున్న ధనయజ్ఞంలో ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టు కూడా ఒక భాగమని బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అవినీతి పాలనకు ప్రజలే చరమగీతం పాడేరోజులు దగ్గర పడ్డాయని ఆయన జోస్యం చెప్పారు.

మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్న బాబు ప్రభుత్వ అవినీతిపై నిప్పులు చెరిగారు. పథకాల పేరు చెప్పి వైఎస్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని, వాస్తవంగా క్షేత్ర స్థాయిలో ఏ పథకం సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ఖజనాను దివాలా తీయించిన వైఎస్‌ అవినీతి ఎల్లలు దాటిపోయిందన్నారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్‌ అవినీతిపై తప్పకుండా విచారణ జరిపి, ప్రజాకోర్టులో వైఎస్‌ను దోషిగా నిలబెడుతామని ఆయన స్పష్టం చేశారు.
వీడియోను వీక్షించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చిరంజీవి కడప యాత్రలో అపశృతి
కేంద్ర ఈసీకి ప్రజారాజ్యం నేతల ఫిర్యాదు
పొత్తులకు ద్వారాలు తెరిచే ఉన్నాం: ధర్మపురి
కనుచూపు మేరలోనే ప్రత్యేక తెలంగాణ : కేసీఆర్
తెలంగాణపై నిర్ణయం చెప్పక తప్పదు : డీఎస్
పథకం ప్రకారమే వటోలీ మారణకాండ : కమిషన్