ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > రేపటి నుంచి కేసీఆర్ 'బస్సుయాత్ర'
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రేపటి నుంచి కేసీఆర్ 'బస్సుయాత్ర'
FileFILE
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు శనివారం నుంచి తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు నుంచి ప్రారంభమయ్యే ఈ తొలి విడత యాత్రలో రాష్ట్ర సాధన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తారు.

తెలంగాణాలోని అన్ని జిల్లాలను కలుపుతూ సాగే ఈ యాత్ర కోసం తెరాస శ్రేణులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఇదిలావుండగా విధాన నిర్ణయాలు, కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు గాను పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 10 లేదా 11 మంది సీనియర్‌ నేతలకు స్థానం కల్పించే అవకాశం ఉంది.

పార్టీకి, తెలంగాణా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన పదిమంది మేధావులను కూడా పార్టీకి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించనున్నారు. ఇదిలావుండగా తెరాస అధిష్టానంపై గుర్రుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ను కేసీఆర్ ఆహ్వానించి బుజ్జగించారు. ఈయనకు ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ జాతీయ వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతలు, పొలిట్‌ బ్యూరోలో స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వామపక్ష నేతలతో భేటీ కానున్న చంద్రబాబు
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు డౌటే : నరేంద్ర
రైతులకు కరెంట్ మర్చిపోవద్దు : సీఎం ఆదేశం
మాకు తెలియకుండా తెలంగాణపై నిర్ణయమా : వీహెచ్
ఆ ప్రాజెక్టులో వైఎస్‌కు భారీగా ముడుపులు: బాబు
చిరంజీవి కడప యాత్రలో అపశృతి