ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > కాంగ్రెస్ మాయలో పడొద్దు: తెరాసకు ఇంద్రసేన విజ్ఞప్తి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాంగ్రెస్ మాయలో పడొద్దు: తెరాసకు ఇంద్రసేన విజ్ఞప్తి
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ పార్టీని తెలంగాణా రాష్ట్ర సమితి మరోమారు నమ్మి మోసపోవద్దని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్.ఇంద్రసేనా రెడ్డి సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని పార్టీ అధినేత చంద్రశేఖర రావుకు నమ్మకముంటే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లోనే విలీనం చేయాలని హితవుపలికారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చేస్తే ఇక తెరాస అవసరమేముందని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు.

తెలంగాణ విషయంలో ఢిల్లీలో నిర్ణయం జరిగిందని, కాంగ్రెస్‌లోని కీలక నేత ఒకరు తనకు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారని కేసీఆర్‌ అంటున్నారు. ఆయనకు ఫోన్‌ చేసిన నేత పేరును కేసీఆర్ వెల్లడించాలి అని డిమాండ్‌ చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని గొప్పగా చెప్పుకొంటున్న ప్రభుత్వం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిరుపయోగమయ్యే పరిస్థితి వస్తుంటే ఏ మాత్రం పట్టించుకోవట్లేదని భాజపా నేతలు ఆరోపించారు.
వీడియోను వీక్షించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కడప దర్గాలో మెగాస్టార్ ప్రత్యేక ప్రార్థనలు  
రేపటి నుంచి కేసీఆర్ 'బస్సుయాత్ర'
వామపక్ష నేతలతో భేటీ కానున్న చంద్రబాబు
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు డౌటే : నరేంద్ర
రైతులకు కరెంట్ మర్చిపోవద్దు : సీఎం ఆదేశం
మాకు తెలియకుండా తెలంగాణపై నిర్ణయమా : వీహెచ్