|
రాష్ట్రంలో ఇళ్ళ స్థలంలేని పేదలకు స్థలాలను పంపిణీ అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ సర్కారు గొప్పగా చెపుతోంది. అయితే అధికారులు మాత్రం అందుకు సంబంధించిన కనీస చర్యలు ఏమాత్రం చేపట్టడం లేదు. ఇందుకు ఉదాహరణలు పలు చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఆరు వేల మంది లబ్ధిదారులను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేశారు. వీరికి ఇళ్ళ స్థలాలను అందజేసేందుకు తొలుత హడావుడి చేశారు.
అదేవిధంగా రామాయంపేటలో కూడా ఇదే తరహాలో రెండు వేల పైచిలుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో కేవలం ఆరుగురికి మాత్రం ఇళ్ళ స్థలాలను అందజేశారు. అర్హులైన మరికొంత మంది లబ్ధిదారులు ఇళ్ళ స్థలాల కోసం అధికారులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అధికారగణం మాత్రం కనికరం చూపడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూత ఎన్నోసార్లు తిరిగినా అధికారులు మాత్రం లబ్ధిదారులను ఎంపిక చేయడం లేదని పలువురు వాపోతున్నారు.
|