ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > 29 నుంచి చిరు నాలుగో విడత యాత్ర
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
29 నుంచి చిరు నాలుగో విడత యాత్ర
ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి నాలుగో విడత పర్యటన ఖరారైంది. ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో సాగుతుంది. అయితే.. పార్టీ వర్గాలు మాత్రం ఈ యాత్రా తేదీలను మాత్రం పార్టీ వర్గాలు ధృవీకరించలేదు. అయినప్పటికీ ఆ జిల్లాలలో ఇప్పటి నుంచే అభిమానులు, కార్యకర్తల హడావుడి ఆరంభమైంది. ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పిన తరువాత తొలి విడతగా చిరంజీవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పర్యటించడం తెలిసిందే.

ఆ తర్వాత మలివిడతగా తెలంగాణ జిల్లాలలోని కరీంనగర్‌, నల్లగొండ, ఖమ్మంలో పర్యటించారు. ప్రస్తుతం చేపట్టిన రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కడప జిల్లాల పర్యటన ముగియనుంది. చిరు పర్యటనలలో అంతకంతకూ ప్రజా ప్రతిస్పందన పెరుగుతోంది. ఇదే ఊపును కొనసాగించాలని పీఆర్పీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. అందులోభాగంగా చిరంజీవి నాలుగో విడత ప్రచారాన్ని ఈనెలాఖరులో ప్రారంభించాలని పీఆర్పీ అధిష్టానం భావిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లబ్ధిదారులపై కనికరం చూపని అధికారులు  
మెగాస్టార్ రెండో రోజు పర్యటన సక్సెస్  
కాంగ్రెస్ మాయలో పడొద్దు: తెరాసకు ఇంద్రసేన విజ్ఞప్తి  
కడప దర్గాలో మెగాస్టార్ ప్రత్యేక ప్రార్థనలు  
రేపటి నుంచి కేసీఆర్ 'బస్సుయాత్ర'
వామపక్ష నేతలతో భేటీ కానున్న చంద్రబాబు