ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా బుధవారం హైదరాబాద్లో కలిశారు. భాజపా-ప్రరాపాల మధ్య పొత్తు పెట్టుకునే అంశంపై వీరిద్దరు చర్చించినట్టు సమాచారం. వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం భాజాపా రాష్ట్రంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. అయితే.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాత్రం ఆ పార్టీతో చేతులు కలిపేందుకు వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రరాపాలో పొత్తుపెట్టుకోవాలని కమలనాథులు ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ ప్రరాపా నేతలు మాత్రం భాజపాతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేస్తున్నారు. అయితే భాజపా నేతలు ప్రరాపా నేతలతో తరచూ కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా బుధవారం చిరంజీవి-శత్రుఘ్నసిన్హాలు భేటీకి అత్యంత ప్రాధాన్యత సమకూరింది. |