ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పీఆర్పీ ఆఫీసు ముందు యువజన కాంగ్రెస్ నిరసన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పీఆర్పీ ఆఫీసు ముందు యువజన కాంగ్రెస్ నిరసన
ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలపై చేసిన ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. వీటిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు జూబ్లీహిల్స్‌లోని ఆ పార్టీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేశారు.

కాంగ్రెస్ నేతలను, ముఖ్యమంత్రి వైఎస్‌తో పాటు ఇతర సీనియర్ నేతలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రరాపా కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు వర్గాలు తలపడటంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను శాంత పరిచారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రజారాజ్యం అధినేతను కలిసిన శత్రుఘ్నసిన్హా
దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి: పవన్ కళ్యాణ్
యాసిడ్ దాడి: బీటెక్ విద్యార్థిని స్వప్నిక మృతి
నిబంధనల లోబడి రోడ్‌షోలు అసాధ్యం
బాలకృష్ణ ఇంట్లో కాల్పులపై పునర్విచారణ!!
మరింత విషమించిన స్వప్నిక ఆరోగ్య పరిస్థితి