డబ్బు సంపాదించేందుకే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారని సినీనటులు రాజశేఖర్ దంపతులు ధ్వజమెత్తారు. హింసాత్మక చర్యలకు పూనుకోవడం, మాటలతో రెచ్చగొట్టడాన్నే ప్రజారాజ్యం పార్టీ వృత్తిగా పెట్టుకుందని వారు దుయ్యబట్టారు. శాంతిమూర్తి మధర్ థెరిస్సా ఆదర్శమంటూ చెప్పుకుంటున్న చిరంజీవి ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని రాజశేఖర్ దంపతులు నిలదీశారు. రెచ్చగొట్టడం సామాజిక న్యాయమా? అని వారు ప్రశ్నించారు. చిరంజీవి మారిన తర్వాతే రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరని, ముందు ఆయనలో మార్పు రావాలని రాజశేఖర్ దంపతులు సూచించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి మనస్తత్వం ఏమిటో వారి మాటల్లోనే అర్థమౌతోందని విమర్శించారు. |