కట్టుకున్న భర్తపై భార్య యాసిడ్తో దాడిచేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో చోటు చేసుకుంది. జనవరి 1 నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు.
ఉదయం నిద్రపోతున్న భర్తపై తన భార్య యాసిడ్ పోసింది. ఈ దాడికి కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ముఖంపై యాసిడ్ ఎక్కువ పడటంతో ముఖం చాలావరకు కాలిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాధితుని పరిస్థితి విషమంగా వున్నట్టు వైద్యులు తెలిపారు.
నూతన సంవత్సరంలోనైనా ఈ యాసిడ్ దాడులను రూపుమాపమని ప్రజలు దేవుళ్ళను వేడుకుంటున్న తరుణంలో ఈ సంఘటన జరగడం దారుణమని స్థానికులు భావిస్తున్నారు. |