ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > మహిళా సాధికారతే మా లక్ష్యం: వైఎస్సార్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహిళా సాధికారతే మా లక్ష్యం: వైఎస్సార్
FileFILE
రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ధ్యేయంగా ప్రతి మండలానికీ రూ.10 కోట్ల రుణాలు మంజూరు చేయనున్నట్లు వైఎస్‌ ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ప్రతి మహిళను లక్షాధికారిని చేసేంత వరకు తమ ప్రభుత్వం నిద్రపోదన్నారు. పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు చేపట్టడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎవరూ సాటి రాలేరని, నాలుగున్నరేళ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరిగిందన్నారు.

తెలుగుదేశం పార్టీ పాలనలో వచ్చిన వరుస కరువుల వల్ల అప్పులపాలైన రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ పథకాన్ని చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ పథకం కింద రూ.11,353 కోట్లు మాఫీ చేసిందని చెప్పారు. అంతేకాకుండా సకాలంలో రుణ బకాయిలు చెల్లించిన రైతాంగానికి సైతం ప్రోత్సాహక బహుమతి రూపేణా రూ.ఐదు వేలు చొప్పున అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎన్నికల రణక్షేత్రం కానున్న తిరుపతి పుణ్యక్షేత్రం
'సైకిల్‌'పై షి'కారు' చేయనున్న తెరాస
ప్రజాబలం ముందు ధనబలం దిగదుడుపే: చిరు
తెదేపాతో ఎన్నికల దోస్తీ ఖరారు కాలేదు: తెరాస
మంత్రుల పనితీరు సరిగాలేదు: మొయిలీ
దేశద్రోహి కాక చిరు దేశ భక్తుడా? : మంత్రి పొన్నాల