ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > డీఎస్ అల్పాహార విందుకు వైఎస్ డుమ్మా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
డీఎస్ అల్పాహార విందుకు వైఎస్ డుమ్మా
FileFILE
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ధర్మపురి శ్రీనివాస్ సోమవారం ఇచ్చిన అల్పాహార విందుకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో మరోమారు డీఎస్-వైఎస్‌ల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే ముఖ్యమంత్రి మరో అధికారిక కార్యక్రమం ఉన్నందువల్లే ఈ భేటీకీ హాజరుకాలేక పోయారని ఆయన సన్నిహిత వర్గాలు కప్పిపుచ్చుతున్నాయి.

జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురైన పరాజయం, ఫలితంగా ఇద్దరు మంత్రుల రాజీనామాల నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకు పార్టీలోని సీనియర్ నేతలతో డీఎస్ తన ఇంటిలో సమావేశం నిర్వహించారు. ఇందులో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వీహెచ్, వెంకటస్వామి, నాదెండ్ల భాస్కరరావు, కేవీపీ.రామచంద్రరావు తదితర సీనియర్లు హాజరయ్యారు.

సీఎం మాత్రం హాజరుకాలేదు. ఆయన మరో అధికారిక కార్యక్రమాన్ని సాకుగా చూపి హాజరుకాలేదు. ఎన్నికలు సమీపిస్తున్నందున, పార్టీని ఓడించేందుకు తెదేపా-వామపక్షాలు ఇప్పటికే చేతులు కలిపాయని, తెరాసను తమ పంచన చేర్చుకునేందుకు ఆ కూటమి నేతలు పావులు కదుపుతున్న విషయం తెల్సిందే.

దీనికి తోడు ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనం జోరుగా ఉంది. ఇలాంటి తరుణంలో తెలంగాణా అంశంపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని సీనియర్లు అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని వారు పేర్కొన్నట్టు సమాచారం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మహిళా సాధికారతే మా లక్ష్యం: వైఎస్సార్
ఎన్నికల రణక్షేత్రం కానున్న తిరుపతి పుణ్యక్షేత్రం
'సైకిల్‌'పై షి'కారు' చేయనున్న తెరాస
ప్రజాబలం ముందు ధనబలం దిగదుడుపే: చిరు
తెదేపాతో ఎన్నికల దోస్తీ ఖరారు కాలేదు: తెరాస
మంత్రుల పనితీరు సరిగాలేదు: మొయిలీ