ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > నిత్యావసర సరుకులు వందరూపాయలకే...ప్రరాప
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నిత్యావసర సరుకులు వందరూపాయలకే...ప్రరాప
FileFILE
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే వంటింటి సరుకులు కేవలం రూ 100లకే అందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవి ఎన్నికల హామీని ప్రకటించారు. సోమవారం రాత్రి నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

ప్రజా అంకిత యాత్రలో భాగంగా చిరంజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తన రెండో రోజుల పర్యటనలో భాగంగా సోమవారం కొనసాగించారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో ఆ తర్వాత జిల్లా కేంద్రంలోను ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రాజ్యమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు హుందాగా బతుకుతున్నారా... లేదే..కూలీలుగా, మెకానిక్‌లుగా, అన్నీ తానై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడితేనే ఓ సామాన్య రైతు కుంటుంబం దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారన్నారు.

ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైయ్యాయని, సామాన్యులు కడుపునిండా తినడానికి తిండి లభించడం లేదని, ఈ పరిస్థితిని చక్కదిద్దడమే ప్రజారాజ్యంపార్టీ ధ్యేయమని వెల్లడించారు. ప్రరాప అధికారంలోకి వస్తే కేవలం రూ 100కే 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ వంటనూనె, 1 కేజీ ఉప్పు, అర కేజీ చింతపండులను ఇస్తామని ఆయన ప్రకటించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
టీడీపీ, వామపక్షాలతోనే పొత్తు.. కేసీఆర్
ఫిబ్రవరిలో ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు
డీఎస్ అల్పాహార విందుకు వైఎస్ డుమ్మా
మహిళా సాధికారతే మా లక్ష్యం: వైఎస్సార్
ఎన్నికల రణక్షేత్రం కానున్న తిరుపతి పుణ్యక్షేత్రం
'సైకిల్‌'పై షి'కారు' చేయనున్న తెరాస