ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > లారీల సమ్మె... స్థంభించిన నిత్యావసర సరుకుల రవాణా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లారీల సమ్మె... స్థంభించిన నిత్యావసర సరుకుల రవాణా
తమ కోరికలు నెరవేర్చాలని కోరుతూ సోమవారం నుండి సమ్మె ప్రారంభించిన లారీ యజమానులు ఈ రోజుకూడా సమ్మెకొనసాగించారు. దీంతో నిత్యావసర సరుకుల రవాణా ఎక్కడికక్కడ స్తంభించింది. తత్ఫలితంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

పెట్రోలు, డీజల్ ధరలను మరింతగా తగ్గించాలని కోరుతూ సమ్మె చేయడం, అలాగే టైర్ల ధరలను కూడా 35 శాతం మేర తగ్గించాలని, టోల్‌ట్యాక్స్ రద్దు, సేవా పన్ను మినహాయింపువంటి పలు డిమాండ్లతో దేశ వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది.

దేశంలోని లారీ యజమానులతో ప్రభుత్వం మూడు దఫాలుగా చర్చలు జరిపినా ఇంతవరకు ఏ ఫలితం కనపడలేదు. కాగా ధరలు ఏ స్థాయికి చేరుకుంటాయోనని ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. సమ్మె కారణంగా దేశంలోని 48 లక్షల వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

ఇదిలావుండగా కేంద్రప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగిస్తామని లారీ యజమానులకు సూచించింది. కాని యజమానులు తమపట్టు విడవకుండా వీలైతే తమ డ్రైవింగ్ లైసెన్సులను సైతం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేస్తామని యజమాన వర్గాలు పేర్కొన్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో ప్రారంభం
నిత్యావసర సరుకులు వందరూపాయలకే...ప్రరాప
టీడీపీ, వామపక్షాలతోనే పొత్తు.. కేసీఆర్
ఫిబ్రవరిలో ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు
డీఎస్ అల్పాహార విందుకు వైఎస్ డుమ్మా
మహిళా సాధికారతే మా లక్ష్యం: వైఎస్సార్