సత్యం కంప్యూటర్స్లో జరిగిన అవతవకలపై సీపీసీఐడీ విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. షేర్ హోల్డర్ల తరపున క్రిమినల్ కేసు పెట్టేందుకు అవకాశాలున్నాయా అన్న కోణంలో పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.అలాగే.. మేటాస్ ప్రాపర్టీస్ చేపట్టిన ప్రాజెక్టుల పనితీరుపై అంచనా వేయాలని, పరిస్థితులు పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు వైఎస్సార్ వెల్లడించారు. కాగా, మేటాస్ ప్రాపర్టీస్తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని ఆయన స్పష్టం చేశారు.మేటాస్ ప్రాపర్టీస్కు భారీ ప్రాజెక్టులు కేటాయించినందున వాటిపై ఏ మేరకు ప్రభావం పడుతుందోనని పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్ తెలిపారు. సత్యం కంప్యూటర్స్ పరిణామాలు చాలా దిగ్ర్భాంతి కలిగిస్తున్నాయని, రామలింగరాజు చెప్పిన మాటల్లోనే అక్కడ ఏం జరుగుతోందో తెలుస్తోందని వైఎస్సార్ అన్నారు. |