దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ యాసిడ్ దాడి సంఘటనను మరచిపోకముందే ఒంగోలు జిల్లాలో మరో ఘాతుకం చోటు చేసుకుంది. ఒక విద్యార్థి సాటి విద్యార్థిని గొంతు కోశాడు. అనంతరం కళాశాల భవనంపై నుంచి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టిచింది.
ఒంగోలు జిల్లా సింగరాయకొండలోని మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై సహా విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న స్రవంతి అనే విద్యార్థిని సహ విద్యార్థి హిమవత్ కుమార్ ప్రేమ పేరుతో గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు.
దీనికి నిరాకరించిన స్రవంతిని ఏవిధంగానైనా తనదానిని చేసుకోవాలనే లక్ష్యంతో సహ విద్యార్థి ప్రయత్నించాడు. అవేమీ ఫలించక పోవడంతో స్రవంతి గొంతు కోశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన స్రవంతిని కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ప్రేమ ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. |