హైదరాబాద్లో మంచి పట్టున్న మజ్లిస్ పార్టీ తన అభ్యర్థులను మంగళవారం పోటీ చేశారు. నాలుగు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. నాంపల్లి నియోజకవర్గానికి విరాసత్ రసూల్ ఖాన్, చాంద్రాయణ గుట్టకు అక్బుద్దీన్ ఓవైసీ, యాకుత్పురాకు ముంతాజ్ ఖాన్, రాజేంద్ర నగర్కు మురధీర్లను ఎంపిక చేశారు.
అలాగే, హైదరాబాద్ లోక్సభ స్థానానికి అసదుద్దీన్ ఒవైసీని అభ్యర్థులుగా ప్రకటించారు. కాగా, వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆ పార్టీ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీతో మజ్లిస్ పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. |