గత ఐదేళ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని పంచభూతాలను దోచుకుందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ తాజాగా ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో కొత్తదనం ఏదీ లేదని తెదేపా నేతలైన రావుల చంద్రశేఖర రెడ్డి, వేణుగోపాలాచారి అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై వారు మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ప్రజల మౌలిక అవసరాలు తీర్చే అంశాలేవీ ఇందులో ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు.
వాగ్ధానాల పరంపర, హామీల వర్షం కురిపించారే గానీ, ప్రజలకు పనికొచ్చే అంశాలే లేవని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ళుగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి మళ్లీ ఆ కార్యక్రమాలన్ని కొనసాగిస్తామంటున్నారని ఆరోపించారు. సమాజంలోని అన్ని వర్గాలకు అన్యాయం చేసి పంచభూతాలను దోచుకున్నారని వారు విమర్శించారు. |