ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > మెగాస్టార్‌తో రెబల్‌స్టార్ దోస్తీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మెగాస్టార్‌తో రెబల్‌స్టార్ దోస్తీ
తెలుగు వెండితెర హీరోలు రాజకీయాల్లో ఒకటయ్యారు. వారిలో ఒకరు మెగాస్టార్. మరొకరు రెబల్ ‌స్టార్. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను తమ నటనతో ఆలరించిన ఈ స్టార్లు ఇకపై ప్రజా సేవ కోసం రాజకీయ తెరపై చేతులు కలిపారు. హైదరాబాద్‌లోని ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పీఆర్పీలోకి కృష్ణంరాజును సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కృష్ణంరాజులు మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చాయని, ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ సేవ చేసేందుకు వచ్చారని, అదే ఆశయంతో తాను కూడా ప్రజారాజ్యంలో చేరినట్టు చెప్పారు. భారతీయ జనతా పార్టీలో ఉంటూ వచ్చిన తాను ఆశించిన స్థాయిలో సేవ చేయలేక పోయానని అందువల్లే వేరే పార్టీలోకి చేరినట్టు చెప్పారు.

అవసరమైతే, పార్టీ ఆదేశిస్తే చిరంజీవితో కలిసి గానీ లేదా ఒంటిరిగా కానీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని కృష్ణంరాజు వెల్లడించారు. ఆ తర్వతా చిరంజీవి మాట్లాడుతూ.. పార్టీ తొలి జాబితాను బుధవారం విడుదల చేస్తామని తెలిపారు. తమ పార్టీలో కోవర్టులు లేరనే తాము భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, కృష్ణంరాజుకు నర్సాపురం లేదా విశాఖ లోక్‌సభ సీట్లను కేటాయించే అవకాశం ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చంద్రబాబు కాళ్ల బేరం: మెట్టు దిగిన కేసీఆర్
ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం: వైఎస్
పంచభూతాలను దోచుకున్న కాంగ్రెస్: తెదేపా
అభ్యర్థులను ప్రకటించిన మజ్లిస్ పార్టీ
పీఆర్పీ ఉమ్మడి గుర్తు కేసు 27కు వాయిదా
మహాకూటమిలోనే తెరాస: నారాయణ