ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ప్రారంభమైన ప్రజారాజ్యం ప్రజారైలు యాత్ర
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రారంభమైన ప్రజారాజ్యం ప్రజారైలు యాత్ర
తమ పార్టీ గుర్తు రైలు ఇంజన్‌ను ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు నిర్ణయించిన ప్రజారాజ్యం పార్టీ శనివారం ప్రజారైలు యాత్రను ప్రారంభించింది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ ‌నుంచి ప్రారంభమైన ఈ ప్రజారైలు యాత్ర మూడు రోజులపాటు కొనసాగనుంది.

రైలుయాత్రలో పాల్గొనేందుకై పీఆర్పీ పార్టీకి చెందిన అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్, చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిద్దరూ పార్టీకి మద్దతుగా నినాదాలు చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. చిరంజీవి, రామ్‌చరణ్‌తేజ, అల్లూ అర్జున్‌ల రాకతో రైల్వే స్టేషన్‌కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుని తమ అభిమాన నటుల్ని చూచి కేరింతలు కొట్టారు.

ఈ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ రైలుయాత్రతో తమ పార్టీ గుర్తైన రైలింజన్ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకు పోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమైన ఈ రైలుయాత్ర మొత్తం మూడురోజులపాటు సాగనుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడల మీదుగా పయనించే ఈ రైలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి వరకు కొనసాగనుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అది ప్రజారాజ్యం కాదు, ధనరాజ్యం: టీడీపీ ఆరోపణ
11 నుంచి ప్రజారైలు యాత్ర: చిరంజీవి
సమాచార హక్కు చట్టం తీసుకువచ్చింది మేమే :రాహుల్
ప్రజారాజ్యం పార్టీ కల్పవృక్షం..చిరు
అరవింద్‌కు నా గురించి సరిగా తెలియదు: పరకాల
నేడే రాష్ట్రంలో రాహుల్‌ పర్యటన