ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పీఆర్పీ ప్రజా రైలుకు విశేష స్పందన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పీఆర్పీ ప్రజా రైలుకు విశేష స్పందన
ప్రజారాజ్యం పార్టీ గుర్తు రైలింజన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రారంభించిన ప్రజా రైలు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి శనివారం ఉదయం ప్రజా రైలు యాత్రను ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చిరంజీవి జెండా ఊపి ప్రజా రైలు యాత్రను ప్రారంభించగా, మూడు రోజుల పాటు జరిగే ఈ యాత్ర సాగుతుంది. ఈ రైలులో ప్రయాణించే యువ నటులు రామ్‌చరణ్‌ తేజ్‌, అల్లు అర్జున్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

యాత్ర ప్రారంభానికే ముందు మంచి ఆదరణ లభిస్తోంది. రైలులో ప్రయాణిస్తున్న యువ హీరోలను చూసేందుకు పీఆర్పీ కార్యకర్తలు, వారి అభిమానులు భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు తరలి వస్తున్నారు. కాగా, ఈ ప్రజా రైలు యాత్ర కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు స్టేషన్లలో ఆగుతుంది.

ఆదివారం శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుగు ప్రయాణం మొదలెట్టి చీపురుపల్లి, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రికి చేరుకుంటుంది. సోమవారం విజయవాడ, గుంటూరు, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంటకు చేరుకుంటుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంగ్రెస్ పథకాలన్నీ అవినీతి మయం: సీపీఎం
ప్రారంభమైన ప్రజారాజ్యం ప్రజారైలు యాత్ర
అది ప్రజారాజ్యం కాదు, ధనరాజ్యం: టీడీపీ ఆరోపణ
11 నుంచి ప్రజారైలు యాత్ర: చిరంజీవి
సమాచార హక్కు చట్టం తీసుకువచ్చింది మేమే :రాహుల్
ప్రజారాజ్యం పార్టీ కల్పవృక్షం..చిరు