కలర్ టీవీలు, నగదు బదిలీ పథకాలతో పేదరికాన్ని నిర్మూలించలేమని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో రాష్ట్రంలో ఇన్నాళ్లూ అధికారం చేపడుతూ వస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు నిర్థిష్టమైన విధానాలు లేవని, ఆ పార్టీలు సమాజం గురించి పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జేపీ గూడూరు, వెంకటగిరి, రాపూరు పట్టణాల్లో రోడ్షోలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి వైఎస్ ఇటీవల ప్రసంగించడాన్ని తప్పుపట్టారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు మనవేనని వాటిని విడదీసి మాట్లాడడం తప్పని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాంప్రదాయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, భిక్షగాళ్లుగా మారుస్తున్నాయని విమర్శించారు. |