భారత నౌకా దళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక విశాఖపట్నం నౌకాశ్రయానికి వచ్చి చేరింది. అత్యాధునిక యుద్ధ నౌకను భారత నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ సురేష్ మెహతా మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ యుద్ధ నౌకను కొల్కతాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిందని ఆయన తెలిపారు.
యుద్ధ నౌకను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ యుద్ధ నౌక యుద్ధం జరిగే సందర్భంలో సముద్రంలోను, భూ భాగంపైకూడా ఇది మంచి సేవలను అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ యుద్ధ నౌకలో పది ప్రధాన యుద్ధ ట్యాంకులు, పదకొండు ట్రక్కులు, సాయుధ బలగాలు దాదాపు 500మందిని తీసుకు వెళ్ళగలిగే సామర్ధ్యం కలిగి ఉందని ఆయన వివరించారు.
దీనిపై హెలికాప్టర్లుకూడా దిగే అవకాశం ఉందని, యుద్ధంలో ఆధునికమైన పద్దతులను పాటించే అవకాశాలు ఈ నౌకలో మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు. |