ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > అభివృద్ధిపై అశ్రద్ధ చేయం: వై.ఎస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అభివృద్ధిపై అశ్రద్ధ చేయం: వై.ఎస్
FILE
గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని ఆదరించారని, దీనికి ప్రతిగా రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళతామని, అభివృద్ధిని ఎట్టి పరిస్థితులలోనూ అశ్రద్ధ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పారు.

మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... పేదల సంక్షేమంపై మరింత శ్రద్ధ చూపి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళతామని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన కారణంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, తన అభిమానులు అభినందనల పేరుతో డబ్బును వృధా చేయవద్దని ఆయన కోరారు.

తాను బుధవారంనాడు చేపట్టబోయే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి తరలి వచ్చేవారు పూల దండలు, శాలువాలు, కండువాలు తదితరాల వంటివి తీసుకురావద్దని ఆయన వారికి సూచించారు.

దీనికైయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సంక్షేమ నిధికి విరాళాలుగా ఇవ్వాలని, విరాళాలుగా వచ్చే ఆ డబ్బుతో ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రేపటి నుంచి ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షలు
భారత నౌకాదళంలో మరో యుద్ధ నౌక
చిరుకు అభినందనలు తెలిపిన "మా"
ముఖ్యమంత్రిగా వైఎస్సార్ రేపు ప్రమాణం
అనుమానితులకు స్వైన్‌ఫ్లూ లేదు: అధికారులు
రాజధానిలో ఉగ్రవాదదాడి: హోంగార్డు మృతి