తిరుమల మొదటి ఘాట్రోడ్డులో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ఆంధ్రా, కర్నాటకకు చెందిన భక్తులుగా తెలియవచ్చింది. వీరంతా శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదిలావుండగా రెండవది తిరుపతి ఘాట్ రోడ్ 33వ మలుపు వద్ద సుమో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని స్థానిక రూయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. |