ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > వైఎస్ ముఠా నాయకుడు: చంద్రబాబు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైఎస్ ముఠా నాయకుడు: చంద్రబాబు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కరుడగట్టిన ముఠా నాయకుడిలాగా ప్రవర్తిస్తున్నాడని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివారం సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. వీరిని పోలీసులు తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

తమ ఎమ్మెల్యేలకు మద్దతుగా చంద్రబాబు నాయుడు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ముఖ్యమంత్రి తమ వాళ్లను వేధింపులకు దురిచేస్తున్నారని విమర్శించారు. మాకు 92 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి మా మద్దుతుంటుంది. కాని అధికార పక్షం మాత్రం మా వాళ్లను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు కళాశాలపై కేసు ఉందుకు ఉదాహరణ అన్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు రక్తపు మరకలు కళాశాల గోడలకు ఉన్నాయని నమూనాలు పంపించారు.

అయితే అవి రక్తపు మరకలు కావని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. అయినా ఈ కేసును సీబీఐకి అప్పజెప్పారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలపై కేసు పెట్టింది ఒక సాక్షి విలేఖరి అని తెలిపారు. ఇంత దిగజారుడుతనంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఇక మీ ఆటలు సాగనియ్యమని, అవసరమైతే జైలులో ఉండైనా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని చంద్రబాబు ఉద్ఘాటించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మురికివాడలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దండి: వైఎస్
తెరాస అసమ్మతివాదులపై సస్పెన్షన్ రద్దు: కేసీఆర్
బాబ్లీ వ్యవహారంపై మహారాష్ట్రకు లీగల్ 'నోటీస్'
దసరా తర్వాత ఆకస్మిక తనిఖీలు: వైఎస్
ప్రరాపా తదుపరి ఎన్నికల గుర్తు "సూర్యుడు"!
శ్రీవారి దర్శనానికి విచ్చేయనున్న ప్రధాని